కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై మంత్రి వెల్లంపల్లి ఫైర్
21 Aug 2020 1:20 PM
తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు సీఎం వైయస్ జగన్, రాష్ట్ర ప్రజలపై ఉండాలని కోరుకున్నానని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. తిరుమల శ్రీవారిని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పండుగలు ఇంటికే పరిమితం కావాలని సూచించాయన్నారు. ఎంపీ రఘురామ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. వైయస్ఆర్ కుటుంబాన్ని ఏ ఒక్క కులానికో, మతానికో అంటకడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రఘురామ కృష్ణంరాజు ఢిల్లీలో కూర్చొని.. చంద్రబాబు హైదరాబాద్లో కూర్చొని నీచ రాజకీయాలు చేస్తున్నారని ఫైరయ్యారు. విగ్రహాలు వీధుల్లో పెట్టరాదనే నిర్ణయానికి ముందు అన్ని పార్టీలు, మఠాధిపతులు, పీఠాధిపతులతో మాట్లాడామన్నారు. చంద్రబాబు డైరెక్షన్లో రఘురామ కృష్ణంరాజు పనిచేస్తున్నారన్నారు.