పిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందే
ఏ మొహం పెట్టుకొని బాబు రామతీర్థం వస్తున్నాడు
02 Jan 2021 1:22 PM
ఆలయాలను కూల్చేసిన దుర్మార్గపు చరిత్ర చంద్రబాబుది
రామతీర్థం ఘటనపై కొన్ని ఆధారాలు లభించాయి
దోషులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తాం
దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
విజయనగరం: రామతీర్థంలో శ్రీరాములవారి విగ్రహం ధ్వంసం ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, లభించిన కొన్ని ఆధారాలతో దోషులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు నాయుడు రామతీర్థానికి ఏ మొహం పెట్టుకొని వస్తున్నాడని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఆలయాలను దగ్గురుండి కూల్చివేసిన దుర్మార్గపు చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు. రామతీర్థం రావడానికి ముందు తన హయాంలో జరిగిన తప్పును ఒప్పుకొని.. క్షమించమని ప్రజలందరినీ వేడుకోవాలన్నారు.
విజయనగరంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ బురదజల్లడానికే చంద్రబాబు రామతీర్థం వస్తున్నారని మండిపడ్డారు. రామతీర్థంలో ఆలయం కొండ కింద.. విగ్రహం కొండ మీద ఉంటుందని, అర్చకులు మాత్రమే వెళ్లి దీపారాధన చేసి.. నైవేద్యం సమర్పిస్తున్నారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు బట్టి గత వారం రోజుల క్రితమే ఆ కొండపై విద్యుత్ సరఫరా ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు అమర్చే సమయంలో ఇలాంటి దురదృష్ట సంఘటన జరిగిందన్నారు. దీనిపై పూర్తిగా పోలీసుల విచారణ జరుగుతుంది. కేవలం రాజకీయం చేయడం కోసం.. ఇళ్ల పట్టాల పంపిణీని డైవర్ట్ చేయడానికి ఈ దుశ్చర్యకు పాల్పడినట్లుగా తెలుస్తుందన్నారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి కొన్ని ఆధారాలు లభించాయని, సెల్ఫోన్ నెట్వర్క్, డాగ్ స్క్వాడ్ అన్నీ చెక్ చేస్తున్నామని, పూర్తి ఆధారాలు లభించే సమయంలో చంద్రబాబు ఎందుకు హడావుడిగా చంద్రబాబు వస్తున్నారనే అనుమానం కలుగుతుందన్నారు.