మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ఐదేళ్ల టీడీపీ పాలనలో అభివృద్ధి శూన్యం
28 Aug 2020 5:54 PM
విజయవాడ నగర అభివృద్ధికి సీఎం కట్టుబడి ఉన్నారు
దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
విజయవాడ: విజయవాడ నగర అభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ కట్టుబడి ఉన్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఎంపీ కేశినేని నాని విజయవాడకు ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదన్నారు. చంద్రబాబు అండ్ కో అమరావతి పేరుతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. కేశినేని నాని, దేవినేని ఉమా, బోండా ఉమా, జలీల్ఖాన్ విజయవాడ నగర అభివృద్ధిని తుంగలో తొక్కారని ఫైరయ్యారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏడాదిలోనే దుర్గగుడి ఫ్లైఓవర్ పనులు పూర్తి చేశారని మంత్రి వెల్లంపల్లి వివరించారు.