ఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా
కోవిడ్పై రాజకీయాలు చేయడం బాధాకరం
29 Jul 2020 12:54 PM
చంద్రబాబు ఒక్కరికైనా భరోసా ఇచ్చారా?
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
విజయవాడ: కోవిడ్పై చంద్రబాబు, లోకేష్ రాజకీయాలు చేయడం బాధాకరమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే..చంద్రబాబు ఒక్కరికైనా భరోసా ఇచ్చారా అని ఆయన ప్రశ్నింంచారు. కరోనా విపత్తులో చంద్రబాబు, లోకేష్ కనిపించకుండా పోయారన్నారు. కరోనా గురించి ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు.ప్రభుత్వపరంగా అన్ని వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. ప్రవేట్ ఆసుపత్రుల్లోనూ కరోనాను ఆరోగ్యశ్రీకింద వైద్యం అందిస్తున్నామని తెలిపారు. కృష్ణా జిల్లా ఆసుపత్రుల్లో బెడ్ల సామర్థ్యాన్ని పెంచామన్నారు. కరోనా పరీక్షల్లో కృష్ణా నంబర్వన్గా ఉందని వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.