‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర జరుగుతోంది
19 Mar 2020 12:15 PM
దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అనుమానం వ్యక్తం చేశారు. విజయవాడలో మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ చంద్రబాబు తొత్తులా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. లేఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు పన్నాగం పన్నుతున్నారనే సందేహం అందరిలో వ్యక్తం అవుతుందన్నారు. లేఖపై ఎన్నికల కమిషనర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. నిమ్మగడ్డ రమేష్కుమార్ మౌనం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.