జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బ తీసేందుకు ప్రతిపక్షం కుట్ర
23 Aug 2019 2:40 PM
తిరుమల బస్ టికెట్ల వ్యవహారంపై విచారణకు ఆదేశం
వెల్లంపల్లి శ్రీనివాస్
విజయవాడ: ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బ తీసేందుకు ప్రతిపక్షం కుట్ర చేస్తుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. తిరుమల బస్ టికెట్ల అన్యమత ప్రచారం ప్రభుత్వ దృష్టికి వచ్చిన వెంటనే విచారణకు ఆదేశించామని తెలిపారు. ఆ టికెట్లు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ముద్రించినట్లు తేలిందన్నారు. నెల్లూరు డిపోలో ఉండాల్సిన టికెట్లు తిరుపతి డిపోకు వెళ్లినట్లు అధికారులు గుర్తించారన్నారు. ఈ వ్యవహారంపై విచారణే కాకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించిందని చెప్పారు. ఉద్దేశ పూర్వకంగా శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసి రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనేదే ప్రతిపక్షం కుట్ర అన్నారు. విష ప్రచారానికి పాల్పడుతున్న మీడియా సంస్థలు, వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.