విద్యా వ్యవస్థలో సంస్కరణలు అమలు చేస్తున్నాం

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. నూతన జాతీయ విద్యావిధానం ప్రణాళికపై విద్యా శాఖ అధికారులతో మంత్రి సురేష్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు అమలు చేస్తున్నామని చెప్పారు. సంస్కరణల అమలులో అధికారులదే కీలకపాత్ర అని గుర్తుచేశారు. ఎన్‌ఈపీ 2020 అమలుపై పకడ్బందీగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. 

Back to Top