మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
త్వరలోనే పలువురు ఎమ్మెల్యేలు కూడా టీడీపీని వీడతారు
21 Jun 2019 12:35 PM
మంత్రి శంకర్ నారాయణ
తిరుపతి : త్వరలోనే పలువురు ఎమ్మెల్యేలు కూడా టీడీపీని వీడతారని మంత్రి శంకర్ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసుల నుంచి తప్పించుకునేందుకే సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, సీఎం రమేష్, గరికపాటి పార్టీ ఫిరాయించారని తెలిపారు. శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సుజనా, సీఎం రమేష్.. చంద్రబాబు బినామీలని ఆరోపించారు. చంద్రబాబు అంగీకారంతోనే వీరంతా పార్టీ మారారని తెలిపారు. త్వరలోనే పలువురు ఎమ్మెల్యేలు కూడా టీడీపీని వీడతారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో టీడీపీ భూస్థాపితం అవుతుందని శంకర్ నారాయణ జోస్యం చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్లుగా పోరాటం చేస్తున్నారని గుర్తుచేశారు. వైయస్ జగన్ నాయకత్వంలో తప్పకుండా ప్రత్యేక హోదా సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.