చంద్రబాబు డైరెక్ష‌న్‌..పవన్ యాక్ష‌న్‌

మంత్రి ఆర్కే రోజా
 

నంద్యాల‌:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖామాత్యులు ఆర్.కె.రోజా సోమ‌వారం శ్రీశైల క్షేత్రాన్ని సంద‌ర్శించి స్వామివార్ల‌ను ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆమెకు శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.  అనంతరం ఆలయం వెలుపల రోజా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే పవన్‌ కళ్యాణ్‌ నడుస్తున్నారని విమ‌ర్శించారు. రాష్ట్రంలో జరుగుతోన్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బాబు అండ్‌ కో ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.  గడిచిన మూడేళ్లలో మా ప్ర‌భుత్వం చేసిన అభివృద్ధి ఏమిటో చర్చించటానికి సిద్ధంగా ఉన్నామన్నారు.  

Back to Top