వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై ప్రభుత్వం దృష్టి
15 Jul 2019 1:15 PM
90 రోజుల్లో ఆర్టీసీ విలీనంపై నిపుల కమిటీ నివేదిక
అద్దె బస్సులు ఫిట్నెస్ లేకపోతే డిపో మేనేజర్పై చర్యలు
రవాణ శాఖ మంత్రి పేర్ని నాని
అమరావతిః ఆర్టీసీ విలీనంపై నిపుణుల కమిటీ వేశామని రవాణ శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు.శాసన మండలిలో మాట్లాడుతూ .. 90 రోజుల్లో నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు.ముందుగా ఉద్యోగుల విలీనంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.అద్దె బస్సులను ఒప్పందం ప్రకారం పరిమితి పూర్తయ్యేవరుకు కొనసాగిస్తామని తెలిపారు.అద్దె బస్సులు ఫిట్నెస్ లేకపోతే డిపో మేనేజర్పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆగస్టు నుంచి అంగన్వాడీలకు పెంచిన జీతాలు చెల్లింపుఃఆళ్ల నాని
గత ప్రభుత్వం ఆశావర్కర్లను పూర్తిగా విస్మరించిందని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పేర్కొన్నారు. శాసన మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు.చంద్రబాబు పెంచిన జీతాలు కాగితాలకే పరిమితం అయ్యాయన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను గత ప్రభుత్వం పక్కదారి పట్టించిందన్నారు.ఆగస్టు నుంచి ఆశావర్కర్లకు పెంచిన జీతాలు చెల్లిస్తామని తెలిపారు. ఇప్పటి వరుకు అవయవాల అక్రమ రవాణాపై రెండు కేసులు నమోదు చేశామని తెలిపారు.విశాఖ శ్రద్ధ ఆసుపత్రి,నెల్లూరులోని సింహపురి ఆసుపత్రిలపై కేసులు నమోదు చేశామన్నారు.విశాఖ శ్రద్ధ ఆసుపత్రి లైసెన్స్ రద్దు చేసి మూసివేయించామని తెలిపారు.