ఎంపీ రెడ్డప్పను పరామర్శించిన మంత్రి పెద్దిరెడ్డి

ఢిల్లీ: అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ సభ్యులు రెడ్డప్పను రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు. ఎంపీ రెడ్డప్ప ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పార్లమెంట్‌ సమావేశాల్లో ఉన్న ఎంపీ రెడ్డప్పకు గుండెపోటు రావడంతో ఢిల్లీలోని ఫోర్టీస్‌ ఆస్పత్రిలో చేర్చారు. ఇటీవలే గుండె ఆపరేషన్‌ జరిగింది. ప్రస్తుతం ఎంపీ రెడ్డప్ప ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు మంత్రి పెద్దిరెడ్డికి వైద్యులు చెప్పారు. 
 

Back to Top