కుప్పం మున్సిపాలిటీలో వైయ‌స్ఆర్‌సీపీదే గెలుపు

 ఎన్నిక‌ల ప్ర‌చారంలో మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి

 చిత్తూరు:  కుప్పం మున్సిపాలిటీలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధిస్తుంద‌ని మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు. సోమ‌వారం కుప్పంలో మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఇంటింటికి వెళ్లి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను వివ‌రిస్తూ ఓట్లు అభ్య‌ర్థించారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ..చిత్తూరు జిల్లా కుప్పంలో వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌చారానికి విశేష స్పంద‌న ల‌భిస్తుంద‌న్నారు.  14 సంవత్సరాల పాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం చేసిన అభివృద్ధి శూన్యం అని అన్నారు. చంద్రబాబు చెప్పుకోవడానికి ఒక్క అభివృద్ధి పని కూడా తన పాలనలో చేయలేదన్నారు. సాగునీరు, తాగునీరు అందించలేని దౌర్భాగ్యస్థితి చంద్రబాబుది అని ఫైర్ అయ్యారు. అనునిత్యం కుప్పం నుంచి బెంగళూరుకు వేలాదిమంది కూలి పనులకు వెళ్తుంటే చంద్రబాబు ఏం చేసాడు అని ప్రశ్నించారు.

చంద్రబాబుకు అసహనం పెరిగిపోయింద‌ని విమ‌ర్శించారు. కుప్పం ప్రజలు కూడా ఇప్పుడు చంద్రబాబు నమ్మడం లేదని జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాజయం తప్పదని అన్నారు. 2014 నుంచి ఐదేళ్ల పాటు సీఎంగా ఉన్న నీళ్లు ఇవ్వడానికి కృషి చేయలేదని అన్నారు. సీఎం వైయ‌స్ జగన్ కుప్పం వాసులకు సాగు, త్రాగు నీరును ఇవ్వడానికి కృషి చేస్తున్నారని అన్నారు. గుడిపల్లి మండలం బసిని గాని పల్లి వద్ద రెండు టీఎంసీల తో కూడుకున్న రిజర్వాయర్  ఏర్పాటు చేసి కుప్పం సమీపంలోని చెరువులకు నీళ్లు అందించడమే కాకుండా కుప్పం వాసులకు తాగునీరు అందిస్తామన్నారు. హంద్రీనీవా జలాలు పది రోజుల్లోనే కుప్పంకు రానున్నాయని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో వైయ‌స్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

Back to Top