రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
మోసం, విశ్వాసఘాతుకానికి ప్రతిరూపం చంద్రబాబు
12 Nov 2021 12:49 PM
బాబు తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు
17వ తేదీ తర్వాత చంద్రబాబు చిత్తూరు జిల్లాకు వచ్చే పరిస్థితి కూడా ఉండదు
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
కుప్పం: ప్రతిపక్షనేత చంద్రబాబు పిచ్చి పతాకస్థాయికి చేరిందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. విశ్వాసఘాతుకానికి, మోసానికి ప్రతిరూపం చంద్రబాబు అని దుయ్యబట్టారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికీ తిరుగుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించి.. వైయస్ఆర్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..
ముఖ్యమంత్రి వైయస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్చుకోలేక అసహనంతో చంద్రబాబు మాట్లాడుతున్నాడని, బాబు ఒళ్లంతా కుట్రలు, విషపూరిత ఆలోచనలతో నిండిపోయిందన్నారు. చంద్రబాబు కాంగ్రెస్లో ఉండి ఎన్టీఆర్పై ఏ రకమైన స్టేట్మెంట్లు ఇచ్చాడు.. టీడీపీలో చేరిన తరువాత ఎన్టీఆర్ మరణానికి ఏ విధంగా కారణమయ్యాడు..? ఇవన్నీ రాష్ట్ర ప్రజలు బేరీజు వేసుకుంటే చంద్రబాబు లాంటి విశ్వాసఘాతకుడు ఈ ప్రపంచంలోనే ఎవరూ ఉండరన్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి వైయస్ జగన్ గురించి ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్నారు. బాబు తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని, కుప్పం ప్రజలు వైయస్ఆర్ సీపీ వెంటే ఉన్నారని, ఈనెల 17వ తేదీ ఎన్నికల కౌంటింగ్ తరువాత చిత్తూరు జిల్లాకు చంద్రబాబు వచ్చే పరిస్థితి కూడా ఉండదన్నారు.