గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాం
అవసరమైన ప్రతి గ్రామంలో ఐసోలేషన్ సెంటర్లు
24 May 2021 1:33 PM
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశం
విజయవాడ: అవసరమైన ప్రతి గ్రామంలోనూ ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం మంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కోవిడ్ సెకెండ్ వేవ్ దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో కోవిడ్ బారిన పడిన వారు ఐసోలేషన్ సెంటర్లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఐసోలేషన్ సెంటర్ల కోసం స్కూళ్లు, ఇతర భవనాలను వినియోగించుకోవాలన్నారు. గ్రామంలో హెల్త్ వర్కర్ పర్యవేక్షణలో కోవిడ్ బాధితులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.డీపీవోలు, ఎంపీడీవోలు ఇందుకు చర్యలు తీసుకుంటారని చెప్పారు. మూడు రోజులకోసారి పంచాయతీ రాజ్ కమిషనర్కు నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు.