పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు?
ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
26 Nov 2020 6:04 PM
ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలి
చిత్తూరు జిల్లా అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టెలికాన్ఫరెన్స్
విజయవాడ: అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, సహాయక చర్యలను ముమ్మరంగా చేపట్టాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు.చిత్తూరు జిల్లా అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నివర్ తుపాన్ కారణంగా సహాయక చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా.. నివర్ తుపాను కారణంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. చెరువులు, జలాశయాల్లో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ముంపు ప్రాంతాలలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, వైద్యంతో పాటు అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లోనూ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలన్నారు.