9 నెలలకే 90 శాతం హామీలు అమలు

 ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

చిత్తూరు: 9 నెలలకే 90 శాతం హామీలు నెరవేర్చిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు. నాలుగేళ్లలో అర్హులందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని వెల్లడించారు. హంద్రీనీవా ద్వారా కుప్పంకు నీరు అందిస్తామని స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గంలోని ఉపాధి హామీ పనుల్లో భారీ అవకతవకలు జరిగాయని చెప్పారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలన్నీ ఆయన అనుచరుల కోసమే అని మంత్రి విమర్శించారు.
 

Back to Top