కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలి
20 Jul 2021 2:27 PM
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
విజయవాడ: మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. విజయవాడలో జగనన్న పచ్చ తోరణం కార్యక్రమంపై సమీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ..జగనన్న పచ్చతోరణంలో అనుకున్నంత ప్రగతి సాధించలేకపోయామని చెప్పారు. రానున్న రెండు మూడు నెలల్లో మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. గ్రామాల్లో సర్పంచ్లు మొక్కల సంరక్షణ బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఉపాధిలో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నామని, మొక్కలు నాటే కార్యక్రమంలో కూడా ఇలాగే మొదటి స్థానంలో నిలవాలన్నారు. అందరూ అధికారులు సమన్వయంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.