చంద్ర‌బాబును ప్ర‌జ‌లు ఎప్పుడో మ‌ర్చిపోయారు

డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయ‌ణ‌స్వామి

తిరుప‌తి: చంద్ర‌బాబు చెప్పేవ‌న్నీ అబ‌ద్ధాలేన‌ని, ప‌నిగ‌ట్టుకొని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అబద్ధాలకు ఎల్లో మీడియా వంతపాడుతోందని మండిప‌డ్డారు. రెండేళ్ల‌లో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్య‌క్ర‌మాలు ఎల్లోమీడియాకు, టీడీపీ నేత‌ల‌కు క‌నిపించ‌డం లేదా అని ప్ర‌శ్నించారు. క‌రోనా సంక్షోభంలో ప‌క్క రాష్ట్రంలోకి వెళ్లి త‌ల‌దాచుకుంటున్న‌ చంద్రబాబును ప్రజలు ఎప్పుడో మరిచిపోయారన్నారు.

Back to Top