కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
రెడ్జోన్లలోనే మినీ కోవిడ్ సెంటర్లు
23 Apr 2020 4:05 PM
డిప్యూటీ సీఎం ఆళ్ల నాని
కర్నూలు: కర్నూలు జిల్లాలో 37 ప్రాంతాలను రెడ్జోన్లుగా ప్రకటించి అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, రెడ్జోన్లలో మిని కోవిడ్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అన్నారు. అంతేకాకుండా ప్రత్యేక ఫీవర్ హాస్పిటల్ను ఏర్పాటు చేసి ఒక మెడికల్ ఆఫీసర్ను కూడా నియమిస్తున్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి ఆళ్ల నాని సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కర్నూలు జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టమని ఆదేశించారన్నారు. కర్నూలులో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 896 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. జిల్లాలోని మూడు వేలకుపైగా శాంపిల్స్ను కోవిడ్ పరీక్షలకు పంపించగా ఇందులో కొన్ని నెగిటవ్ వచ్చాయన్నారు. రాపిడ్ కిట్స్తో టెస్టులు చేయబోతున్నామని వివరించారు.