పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక

మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, అవంతి శ్రీనివాస్‌
 

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారని ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. విశాఖలో ప్రారంభమైన ఫస్ట్‌ కాన్సులేట్‌ బిజినెస్‌ మీట్‌కు  మంత్రులు గౌతమ్‌రెడ్డి, అవంతి శ్రీనివాస్, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ రఘురామ కృష్ణంరాజు హాజరయ్యారు. ఈ మేరకు మంత్రులు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇందుకు సీఎం వైయస్‌ జగన్‌ ప్రత్యేక ప్రణాళిక రూపొందించారని వివరించారు. విశాఖలో ఆక్వాలాబ్‌ ఏర్పాటు ప్రతిపాదన ఉందని, విశాఖ పారిశ్రామిక అభివృద్ధి దశలో ఉందని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు.

తాజా వీడియోలు

Back to Top