మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్తో మంత్రి గౌతమ్రెడ్డి భేటీ
16 Jun 2021 5:19 PM
కాకికాడ పెట్రో కెమికల్ కారిడార్పై చర్చ
ఢిల్లీ: కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో రాష్ట్ర పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి భేటీ అయ్యారు. కాకినాడ పెట్రో కెమికల్ కారిడార్పై కేంద్రమంత్రితో చర్చించారు. అనంతరం మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాకినాడ పెట్రో కెమికల్ కారిడార్కు కేంద్రప్రభుత్వం సానుకూలంగా ఉందని, పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉందన్నారు. రూ.25 వేల కోట్ల పెట్టుబడితో పెట్రో కెమికల్ రిఫైనరీ ఏర్పాటు చేయాలని కోరామన్నారు. దేశ వ్యాప్తంగా ఇథనాల్ ఉత్పత్తి పెంచే చర్యల్లో భాగంగా ఏపీకి రూ.1000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుందని తెలిపారు. గత వారంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని కలిసి ఇచ్చిన అంశాలపై సైతం చర్చించానని మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి తెలిపారు.