అబద్ధాలతో రాజకీయాలు చేస్తున్నారు

మంత్రి కన్నబాబు
 

అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు తన జీవిత కాలమంతా అబద్ధాలతో రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కన్నబాబు విమర్శించారు. మా ప్రభుత్వం ఉద్యమంలా రైతులకు ఇన్‌పుట్‌ సబ్పిడీ అందజేస్తోందని తెలిపారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వం రూ.2250 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వకుండా ఎగ్గొట్టిందని విమర్శించారు.  ఎగ్గోట్టడంలో చంద్రబాబును మించిన వ్యక్తి ఉండరు. అబద్ధాలు ప్రచారం చేస్తూ రాజకీయాలు. మద్యం కొత్త బ్రాండ్స్‌ తెచ్చింది చంద్రబాబే. ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వడం లేదని అబద్దాలు చెబుతున్నారు. మా ప్రభుత్వం ఇన్‌పుట్‌ సబ్పిడీని సకాలంలో ఇస్తుందని మంత్రి కన్నబాబు వివరించారు.
 

Back to Top