పోలీసులపై గౌరవం పెరిగేలా సంస్కరణలు తెచ్చాం

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

అమరావతి: పోలీస్‌ వ్యవస్థను పటిష్టం చేసే దిశగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు చేపట్టారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. పోలీసుల పట్ల ప్రజల్లో గౌరవం పెరిగేలా సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. పోలీస్‌ వ్యవస్థలో కీలకమైంది ఏపీఎస్పీ బెటాలియన్‌ అని, విపత్తు సమయాల్లో ఏపీఎస్పీ బెటాలియన్‌ సేవలు కీలకమన్నారు. మహిళల రక్షణ కోసం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ దిశ చట్టాన్ని తీసుకొచ్చారని గుర్తుచేశారు. పోలీసులకు వీక్లీ ఆఫ్‌ ప్రకటించిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌కే దక్కుతుందన్నారు. 
 

Back to Top