వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
మహా పాదయాత్రతో టీడీపీ ముసుగు తొలిగి పోయింది
08 Oct 2022 3:10 PM
పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
పశ్చిమగోదావరి:మహా పాదయాత్రతో టీడీపీ ముసుగు తొలిగి పోయిందని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. అమరావతి పేరుతో చంద్రబాబు బినామీల రాజధాని కట్టాలని చూశారని మండిపడ్డారు. శనివారం వికేంద్రీకరణకు మద్దతుగా తణుకు నియోజకవర్గంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి మనల్ని తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం విడిపోవడానికి కారణం చంద్రబాబు అన్నారు. తన స్వార్థం కోసం అసైన్డ్ భూముల చట్టాన్ని కూడా మార్చారని మండిపడ్డారు.
నూజవీడులో రాజధాని వస్తుందని నమ్మి భూములు కొన్న చాలా మంది రైతులు చనిపోయారు. అమరావతి చుట్టూ తన అనుయాయులతో భూములు కొనిపించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. అందులో అమరావతి ఉండాలన్నదే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యం. 29 గ్రామాల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి కాదు. భూములు ఇవ్వమన్న రైతులకు సీపీఎం, సీపీఐ, జనసేన నాడు మద్దతుగా నిలిచి ఇప్పుడు మాట మార్చాయి. 29 గ్రామాల ప్రజలు కోసం మూడు ప్రాంతాల ప్రజలు మోసపోవాలా? అని ప్రశ్నించారు.