రేపటి నుంచి మొక్కజొన్న కొనుగోలు ప్రారంభం 

ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని  సీఎం ఆదేశించారు

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు 

తాడేపల్లి: రేపటి నుంచి మొక్కజొన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలపై ఆయన సోమవారం టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు. వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ అధికారులతో మంత్రి కన్నబాబు  కలెక్టర్లు, మార్కెటింగ్ జాయింట్ డైరెక్టర్లతో మాట్లారు. ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ మోహన్‌ రెడ్డి  ఆదేశించారన్నారు. పంటల మద్దతు ధరలు పడిపోవడానికి వీల్లేదని మంత్రి  అధికారులను అదేశించారు. 
ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించామని కన్నబాబు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యంపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఏ రైతు ఇబ్బంది పడటానికి వీల్లేదని, మామిడి, ఇతర పండ్ల ధరలు పడిపోకుండా చూడాలి కన్నబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు.  

తాజా వీడియోలు

Back to Top