ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
రేపటి నుంచి మొక్కజొన్న కొనుగోలు ప్రారంభం
06 Apr 2020 11:57 AM
ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని సీఎం ఆదేశించారు
వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు
తాడేపల్లి: రేపటి నుంచి మొక్కజొన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలపై ఆయన సోమవారం టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు. వ్యవసాయ, మార్కెటింగ్శాఖ అధికారులతో మంత్రి కన్నబాబు కలెక్టర్లు, మార్కెటింగ్ జాయింట్ డైరెక్టర్లతో మాట్లారు. ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. పంటల మద్దతు ధరలు పడిపోవడానికి వీల్లేదని మంత్రి అధికారులను అదేశించారు.
ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించామని కన్నబాబు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యంపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఏ రైతు ఇబ్బంది పడటానికి వీల్లేదని, మామిడి, ఇతర పండ్ల ధరలు పడిపోకుండా చూడాలి కన్నబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు.