చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేదు
12 Sep 2019 3:23 PM
మంత్రి కన్నబాబు
అధిక ధరలకు విక్రయిస్తే వ్యాపారులపై చర్యలు తప్పవు
మార్క్ ఫెడ్ నుంచి డీలర్లకు యూరియా సరఫరా ఆపివేశాం
39 మంది ఉద్యానవన శాఖ అధికారుల పోస్టులను భర్తీ చేస్తాం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేదని మంత్రి కన్నబాబుమ స్పష్టం చేశారు. కొందరు వ్యాపారాలు కావాలనే యూరియా కొరత సృష్టిస్తున్నారని అన్నారు. ఉద్యాన వన శాఖపై ఈరోజు ఆయన సమీక్షించారు. ఉద్యానవన పంటలను ఈ ఏడాది మరో లక్ష ఎకరాలకు పెంచాలన్నది తమ లక్ష్యంగా చెప్పారు. గత ఏడాది కంటే అరటి, మామిడి ఎగుమతులను కూడా పెంచే ప్రయత్నం చేస్తామని అన్నారు. రాష్ట్రంలో 39 మంది ఉద్యానవన శాఖ అధికారుల పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. మార్క్ ఫెడ్ నుంచి డీలర్లకు యూరియా సరఫరా ఆపివేశామని, అధిక ధరలకు విక్రయిస్తే వ్యాపారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో యూరియా డిమాండ్ గతంలో కంటే పెరిగిందని, అవసరమైన మేరకు యూరియా తెప్పించేందుకు కేంద్రంతో మాట్లాడుతున్నట్టు చెప్పారు.