వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
నవరత్నాలతో ప్రతి ఇంటా సంతోషం
10 Nov 2022 1:01 PM
కొంకేపూడి, ఈదుముడి గ్రామాల్లో గడప గడపకూ మన ప్రభుత్వం
పాల్గొన్న గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్
పెడన: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ప్రతీ కుటుంబం సంతోషంగా ఉందని, నవరత్నాలతో పేదల ముఖాల్లో వెలుగులు నిండాయని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. పెడన మండలం కొంకేపూడి సచివాలయ పరిధిలోని కొంకేపూడి, ఈదుముడి గ్రామాల్లో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి వివక్ష, అవినీతి లేకుండా అర్హులందరికీ సంక్షేమ సాయం నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలో జమ అవుతుందని చెప్పారు. పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా సీఎం వైయస్ జగన్ పాలన కొనసాగుతోందని ప్రజలకు వివరించారు. అక్కచెల్లెమ్మల ఆర్థికాభివృద్ధికి ముఖ్యమంత్రి కృషిచేస్తున్నారని చెప్పారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని మంత్రి జోగి రమేష్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయం సిబ్బంది, వలంటీర్లు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.