మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
కార్మికుల పొట్టకొట్టిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు
25 Feb 2020 5:33 PM
ఈఎస్ఐ స్కామ్లో అచ్చెన్నాయుడు, పితాని ప్రమేయం ఉంది
కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం
విజయవాడ: కార్మికుల పొట్టకొట్టిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. కార్మిక శాఖ రాష్ట్రస్థాయి సమీక్షా సమావేశాన్ని సచివాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జయరాం మాట్లాడుతూ... రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన కార్మిక శాఖ అధికారులతో 16 అంశాలపై చర్చించామన్నారు. గత ఐదు సంవత్సరాల్లో కార్మిక శాఖ గాది తప్పిందని, కార్మిక శాఖను ప్రక్షాళన చేస్తున్నామని చెప్పారు. ఈఎస్ఐలో భారీ కుంభకోణం బయటపడిందని, ఈ స్కామ్లో గతంలో కార్మిక శాఖ మంత్రులుగా పనిచేసిన అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణ ప్రమేయం ఆధారాలతో సహా బయటపడిందన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని చెప్పారు. దోషులకు శిక్ష తప్పదన్నారు.
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిస్తాం
రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిస్తామని, ఆ దిశగా అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందని కార్మిక శాఖ మంత్రి జయరాం చెప్పారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం ఇందుకు దోహదపడుతుందన్నారు. పిల్లలను పనికి కాదు.. బడికి పంపించాలని సీఎం వైయస్ జగన్ అమ్మ ఒడి పథకాన్ని తీసుకువచ్చారన్నారు. చిన్నారులను బడికి పంపించే తల్లుల బ్యాంకు అకౌంట్లలో రూ. 15 వేలు జమ చేశారన్నారు. అక్కాచెల్లెమ్మలు కూడా వారి బిడ్డలను చదివించుకోవాలనే ఆలోచన చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో సుమారు 2 వేల మంది బాల కార్మికులు ఉన్నారని అధికారులు చెప్పారని, వచ్చే జూన్ మాసం వరకు బాల కార్మిక వ్యవస్థ ఉండకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు.