నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడే
ఇది చాలా చారిత్రాత్మక సమావేశం
28 Jun 2019 6:04 PM
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి
ఇరు రాష్ట్రాల ప్రజల సంక్షేమం, సమస్యల పరిష్కారమే ధ్యేయం
హైదరాబాద్: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జరిగిన సమావేశం చాలా చారిత్రాత్మకమైనదని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఈటల రాజేందర్ సాయంత్రం హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ.. ఈ సమావేశంలో పునర్విభజన చట్టంలోని అంశాలపై చర్చించామని చెప్పారు. నదీ జలాలను ఇరు రాష్ట్రాలు వినియోగించుకునేందుకు ప్రణాళిక రూపొందించి, షెడ్యూల్ 9, 10లోని అంశాలను పరిష్కరించే దిశగా చర్చించామని చెప్పారు. నదీ జలాల వినియోగంపై జులై 15 లోగా ప్రాథమిక నివేదిక సిద్ధమవుతుందన్నారు. రెండు రాష్ట్రాల్లోని మెట్ట ప్రాంతాలకు నీరు అందించడమే తమ లక్ష్యమని అన్నారు. చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకుంటామని చెప్పారు. ఇరు రాష్ట్రాల ప్రజల సంక్షేమం, సమస్యల పరిష్కారమే ధ్యేయమని, సమస్యలు పరిష్కరించుకుంటేనే రాష్ట్రాలు బాగుపడతాయని, తెలంగాణ, ఏపీలు గొప్ప వ్యవసాయ రాష్ట్రాలుగా ఎదగాలని ఈటల ఆకాంక్షించారు.