టికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు
వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తికి జిందాల్ ప్లాంట్
17 Jun 2021 11:22 AM
ప్లాంట్ పనులను పరిశీలించిన మంత్రి బొత్స సత్యనారాయణ
గుంటూరు: వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయనున్న జిందాల్ ప్లాంట్ను మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పరిశీలించారు. జిందాల్ ప్లాంట్ పనులు 2016లో ప్రారంభమయ్యాయని, గత ప్రభుత్వం కేవలం 10 శాతం పనులే చేసిందన్నారు. వైయస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చాక జిందాల్ ప్లాంట్ పనులు వేగవంతం చేశామన్నారు. వచ్చే నెలలో ప్లాంట్ను ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. గుంటూరు, విజయవాడ, తాడేపల్లి–మంగళగిరి కార్పొరేషన్ సహా మరో 6 మున్సిపాలిటీల నుంచి వచ్చే చెత్తను ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేయనున్నామన్నారు. విశాఖలోనూ ఈ తరహా ప్లాంట్ నిర్మాణంలో ఉందన్నారు. ఈ ప్లాంట్ ద్వారా 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని చెప్పారు.