రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తికి జిందాల్ ప్లాంట్
17 Jun 2021 11:22 AM
ప్లాంట్ పనులను పరిశీలించిన మంత్రి బొత్స సత్యనారాయణ
గుంటూరు: వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయనున్న జిందాల్ ప్లాంట్ను మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పరిశీలించారు. జిందాల్ ప్లాంట్ పనులు 2016లో ప్రారంభమయ్యాయని, గత ప్రభుత్వం కేవలం 10 శాతం పనులే చేసిందన్నారు. వైయస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చాక జిందాల్ ప్లాంట్ పనులు వేగవంతం చేశామన్నారు. వచ్చే నెలలో ప్లాంట్ను ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. గుంటూరు, విజయవాడ, తాడేపల్లి–మంగళగిరి కార్పొరేషన్ సహా మరో 6 మున్సిపాలిటీల నుంచి వచ్చే చెత్తను ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేయనున్నామన్నారు. విశాఖలోనూ ఈ తరహా ప్లాంట్ నిర్మాణంలో ఉందన్నారు. ఈ ప్లాంట్ ద్వారా 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని చెప్పారు.