టికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు
ఏ ప్రాంతంలో ఏ పంట పండుతుందో చెప్పగలవా..?
30 Nov 2020 3:09 PM
లోకేష్కు మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్
ట్రాక్టర్ను బురద గుంటలోకి పోనివ్వడం తప్ప లోకేష్కు ఏం తెలుసు
శాసనమండలి: ఏ ప్రాంతంలో ఏం పంట పండుతుందో తెలియని లోకేష్.. పంట నష్టం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. లోకేష్ ఎక్కడ ఏం పంట పండుతుందో చెబితే నేను తలదించుకొని కూర్చుంటా అని సవాల్ విసిరారు. నివర్ తుపాన్ ప్రభావంతో జరిగిన పంట నష్టంపై శాసనమండలిలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ట్రాక్టర్ ఎక్కి ఫొటోలకు ఫోజులు ఇవ్వడం కాదు.. రాష్ట్ర రైతాంగం, వ్యవసాయ రంగంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. రైతు ట్రాక్టర్ను బురద గుంటలోకి పోనివ్వడం తప్ప లోకేష్కు ఏం తెలుసు అని ప్రశ్నించారు. చంద్రబాబు మనసులో మాట పుస్తకంలో వ్యవసాయం దండగ అని రాశారని మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తుచేశారు.