సీఎం వైయస్‌ జగన్‌ దృష్టిలో అందరూ సమానమే

మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

విశాఖపట్నం: వైజాగ్‌ నగరంలోని ఎన్‌ఏడీ జంక్షన్‌లో ఫ్లైఓవర్‌ పనులను మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. తాటిచెట్లపాలెం నుంచి గోపాలపట్నం వరకు ఫ్లైఓవర్‌ రోడ్డు పనులను మంత్రి ప్రారంభించారు. ఫైఓవర్‌ను త్వరతగతిన అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ప్రభుత్వ భూముల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి బొత్స అన్నారు. సబ్సం హరి విషయంలో అధికారులు రూల్స్‌ ప్రకారమే వెళ్లారన్నారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల తొలగింపును రాజకీయాలతో ముడిపెట్టొద్దన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టిలో అందరూ సమానమేనని వివరించారు. 

 

Back to Top