మద్య నిషేధమే ప్రభుత్వం ఉద్దేశం 

 ప్రజల యోగక్షేమాలు టీడీపీకి అవసరం లేదా..?
 
 మంత్రి బొత్స సత్యనారాయణ

విజయనగరం: రాష్ట్రంలో దశల వారిగా మద్యపానాన్ని నిషేధించడం ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.  అందులో భాగంగానే ధరలు పెంచామని, మద్యం తాగేవారిని తగ్గించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన వివరించారు.  ప్రభుత్వం ధనార్జన కోసం చూస్తుందన్న విమర్శలను మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. టీడీపీ నేత యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. సోమవారం ఆయన విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. 

రాష్ట్రాన్ని దివాళా తీయించారు
చంద్రబాబు, యనమల కలిసి రాష్ట్రాన్ని దివాళా తీసేలా చేశారని బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు.  టీడీపీ నేతలు ఏం సాధించాలని ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కరోనా కష్టకాలంలో ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. కమీషన్లు కోసం కక్కుర్తి పడటం టీడీపీ నేతల బుద్ధి అని ఫైర్‌ అయ్యారు. ప్రజల యోగక్షేమాలు టీడీపీ నేతలకు అవసరం లేదా అని మంత్రి బొత్స ప్రశ్నించారు. రాష్ట్రం దివాళా తీయాలని టీడీపీ నేతలు కోరుకుంటున్నారా అని మండిపడ్డారు. నిత్యావసర వస్తువుల ధరల పెరగకుండా రూ.3వేల కోట్ల ప్రత్యేక నిధి ద్వారా నియంత్రణ చేస్తున్నామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top