టీడీపీ సభ్యులకు ప్రజాసమస్యలు పట్టవు

శాసనమండలిలో టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి బొత్స ఆగ్రహం

శాసనమండలి: కౌన్సిల్‌లో టీడీపీ సభ్యుల తీరును మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తప్పుబట్టారు. సభ సజావుగా జరగనివ్వకుండా పదేపదే సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్న టీడీపీ సభ్యుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.  తెలుగుదేశం పార్టీ సభ్యులకు ప్రజాసమస్యలు పట్టవన్నారు. సభలో గందరగోళం సృష్టించి ప్రజా సమస్యలను పక్కదోవ పట్టిస్తున్నారని, ప్రభుత్వం సమాధానం చెబుతున్నా వినకుండా నినాదాలు చేస్తున్నారని మండిపడ్డారు. 
 

Back to Top