విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను
పేదవాడి కడుపుకొట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదు
30 Jul 2019 10:24 AM
మంత్రి బొత్స సత్యనారాయణ
అమరావతి: పేదవాడి కడుపుకొట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో అన్న క్యాంటీన్లపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. చాలా చోట్ల ఎన్నికల ముందు హడావుడిగా అన్నా క్యాంటీన్లు పెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో 183 అన్నా క్యాంటీన్లు మాత్రమే ఉన్నాయని ఆయన తెలిపారు. ఎక్కడా కూడా అన్నా క్యాంటీన్లు మూసి వేయలేదని వివరించారు. ఎక్కడెక్కడ అన్నా క్యాంటీన్లు ఉండాలనే దానిపై ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తామని చెప్పారు.