త్వరలోనే 9 గంటల ఉచిత విద్యుత్‌

రాష్ట్రాభివృద్ధిపై వైయస్‌ జగన్‌ ఆకాంక్షను తెలియజేసింది

మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

అమరావతి: త్వరలోనే వ్యవసాయానికి పగటి పూట 9 గంటలు ఉచిత విద్యుత్‌  ఇస్తామని విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.  గవర్నర్‌ ప్రసంగంలో రాష్ట్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆకాంక్షను తెలియజేసిందని తెలిపారు. గవర్నర్‌ ప్రసంగంపై ఆయన మీడియాతో మాట్లాడారు. వైయస్‌ జగన్‌ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారన్నారు. ప్రజాకర్షక నిర్ణయాల్లో తండ్రిలాగే వైయస్‌ జగన్‌ కూడా తీసుకున్నారన్నారు. మాది రైతు ప్రభుత్వమన్నారు. 
 

Back to Top