వారం రోజుల్లో ప‌ర్యాట‌కుల‌కు అనుమ‌తిస్తాం

ప‌ర్యాట‌క, సంస్కృతిక శాఖ మంత్రి అవంతి శ్రీ‌నివాస్‌

అమ‌రావ‌తి: రాష్ట్రంలోని అన్నిప‌ర్యాట‌క ప్రాంతాల్లో వారం రోజుల్లో పర్యాటకులకు అనుమతిస్తామ‌ని ప‌ర్యాట‌క, సంస్కృతిక‌ శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. పర్యాటక ప్రాంతాలన్నింటినీ మ‌ళ్లీ అందుబాటులోకి తెస్తున్నామ‌న్నారు. స‌చివాల‌యం మంత్రి అవంతి శ్రీ‌నివాస్ మీడియాతో మాట్లాడుతూ.. ఆగ‌స్టు 15 నుంచి అన్ని చోట్ల నుంచి బోట్లు తిరిగేలా చర్యలు తీసుకుంటామ‌న్నారు. టూరిస్ట్ బస్సులను కూడా వారం రోజుల్లో సిద్ధం చేస్తామన్నారు. త్వ‌ర‌లోనే జిమ్‌ల‌ను సైతం రాష్ట్రంలో ప్రారంభిస్తామన్నారు. టెంపుల్ టూరిజంను మ‌రింత‌ అభివృద్ధి చేస్తామ‌ని హామీ ఇచ్చారు. 'ప్ర‌సాద్' స్కీం ద్వారా సింహాచ‌లం దేవ‌స్థానాన్ని అభివృద్ధి చేస్తామ‌ని, ఇప్ప‌టికే శ్రీశైలంలో రూ.50 కోట్ల‌తో అభివృద్ధి పనులు చేప‌ట్టామ‌న్నారు. త్వ‌ర‌లోనే 4 క్రీడా వికాస కేంద్రాల‌ను ప్రారంభిస్తామ‌ని చెప్పారు. ప్ర‌తిభ గ‌ల పేదల పిల్ల‌ల‌ను క్రీడల్లో ప్రోత్సహించాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ నిర్ణయించార‌ని, అందులో భాగంగా గ‌తేడాది రూ.3 కోట్లు పేద క్రీడాకారుల‌కు అందించ‌గా, ఈ ఏడాది మ‌రో రూ.3 కోట్ల‌ను కేటాయించార‌ని తెలిపారు. పీవీ సింధు అకాడ‌మీకి విశాఖ‌ప‌ట్నంలో భూములు కేటాయిస్తామని అవంతి శ్రీనివాస్ తెలిపారు.

 

 

 

Back to Top