వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
15 కంటైన్మెంట్ జోన్లలో ఎలాంటి సడలింపులు లేవు
04 May 2020 2:42 PM
పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్
విశాఖ: విశాఖపట్నం జిల్లాలో 15 కంటైన్మెంట్ జోన్లలో ఎలాంటి సడలింపులు లేవని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. కేంద్ర సూచనల మేరకు మరో రెండు వారాలపాటు ఆంక్షలు కొనసాగుతాయని వివరించారు. విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. కంటైన్మెంట్ జోన్లలో మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో లాక్డౌన్ సడలింపులు చేశామన్నారు. కంటైన్మెంట్ జోన్లలో కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కంటైన్మెంట్ కాని జోన్లలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మినహాయింపులు ఉన్నాయని, మండల స్థాయిలో అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి ఆంక్షల మినహాయింపులపై అక్కడికక్కడే నిర్ణయం తీసుకునే విధంగా చర్యలు చేపట్టామన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయదారులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపడుతున్నావని వివరించారు.