వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
బ్యాడ్మింటన్ అకాడమీకి ఐదు ఎకరాలు
13 Sep 2019 12:53 PM
మంత్రి అవంతి శ్రీనివాస్
అమరావతి: విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీకి 5 ఎకరాలు ఇస్తామని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు మరిన్ని పతకాలు సాధించాలని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఇవాళ ఉదయం పీవీ సింధు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ సింధును అభినందించారు. అనంతరం ఆ వివరాలను మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియాకు వివరించారు. సింధుకు అన్ని విధాలుగా ప్రభుత్వం సహకారాలు అందిస్తుందని సీఎం చెప్పారన్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారులను ప్రోత్సహించాలని సీఎం సూచించినట్లు తెలిపారు.