రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
వైయస్ జగన్ పాలనలో జలాశయాలకు నిండుదనం
24 Aug 2020 1:08 PM
పంటలకు సమృద్ధిగా నీటిని అందిస్తాం
రంగు మారే ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
నెల్లూరు: వైయస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా రెండోసారి జలాశయాలకు నిండుదనం వచ్చిందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ..రాష్ట్రంలోని జలాశయాలను పూర్తిస్థాయి సామర్థ్యంతో నింపుతామన్నారు.
సోమశిల చరిత్రలో..
గతంలో దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో భారీగా వర్షాలు కురిశాయి. మళ్ళీ జగనన్న పాలనలోనే ఈ జలాశయాలకు నీళ్లు వస్తున్నాయి. సోమశిల చరిత్రలో గత ఏడాది మొదటి సారి పూర్తి సామర్థ్యం 78 టీఎంసీల మేర నీటిని నింపాం. ఈ ఏడాది కూడా 78 టీఎంసీల మేర నీటిని నింపుతాం. కండలేరు జలాశయానికి కూడా నీటిని విడుదల చేస్తున్నాం. ఈ ఏడాది పంటలకు సమృద్ధిగా నీటిని అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.
రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకే రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. వర్షాలు కురుస్తుండటంతో రంగు మారే అవకాశం ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి అనిల్కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.