ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మ
అచ్చెన్నాయుడు దోపిడీపై విచారణ చేస్తే బీసీ అంటారా..?
22 Feb 2020 12:28 PM
మంత్రి అనిల్కుమార్యాదవ్
అమరావతి: అచ్చెన్నాయుడు దోపిడీపై విచారణ చేస్తే బీసీ అంటారా..ఇదేమీ న్యాయమని మంత్రి అనిల్కుమార్యాదవ్ ప్రశ్నించారు. ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగింది.అవినీతి చేసి కులాలను పైకి తీసుకొస్తున్నారు. అచ్చెన్నాయుడిపై విచారణ జరిగితే..ఆయన సచ్ఛీలుడైతే, సత్యహరిశ్చంద్రుడిలా బయటకు వస్తారు. దానికి భయమెందుకు, ఉలుకెందుకు?. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నంద్యాల ఉప ఎన్నికల సమయంలో పోలీసులు నోటిస్ ఇస్తేనే నాపై ఆరోపణలు చేశారు. ఎల్లోమీడియాలో చాలా కథనాలు రాశారు. అప్పుడు బీసీలు గుర్తుకు రాలేదా?. బీసీకి మంత్రి పదవి ఇస్తే అసెంబ్లీలోనే నాపై విమర్శలు చేశారు.