బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
రొట్టెల పండుగను ఘనంగా నిర్వహించాలి
09 Sep 2019 3:33 PM
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి అనిల్కుమార్
నెల్లూరు: మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ ఏర్పాట్లను రాష్ట్ర్ర నీటి పారుదల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సోమవారం పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి అనిల్ మీడియాతో మాట్లాడుతూ..గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లకు తావులేకుండా అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో ఏర్పాట్లు చేశామన్నారు. రొట్టెల పండుగ పూర్తయ్యే వరుకూ బారా షాహీద్ దర్గాలోనే భక్తులకు అందుబాటులో ఉంటానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.
మీడియా సెంటర్ను ప్రారంభించిన మంత్రి ...
రొట్టెల పండుగ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను మంత్రి అనిల్కుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి, నేతలు మాలెం సుధీర్కుమార్ రెడ్డి, దర్గా కమిటీ ఛైర్మన్ రజాక్,మున్నా తదితరులు పాల్గొన్నారు.