ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మ
మా ప్రభుత్వం ప్రతిపక్షం మైక్ కట్ చేయదు
10 Jul 2019 1:22 PM
మంత్రి అనిల్ కుమార్
గతంలో బీఏసీ సమావేశంలో మాకు మాట్లాడే అవకాశం లేదు
అచ్చెన్నాయుడు పశ్చాత్తాపం చెంది ఉంటారు
అమరావతి: మా ప్రభుత్వం ప్రతిపక్షం మైక్ కట్ చేయదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం సమస్యలపై చర్చలను పట్టించుకున్న దాఖలాలు లేవని విమర్శించారు. ఏపీ శాసనసభ కార్యకలాపాల సలహామండలి (బీఏసీ) సమావేశంలో అనిల్ కుమార్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, గతంలో బీఏసీ సమావేశంలో తమకు మాట్లాడే అవకాశం లేదని అన్నారు. ఇప్పుడు బీఏసీ సమావేశం జరిగిన తీరు చూసి తామెంతో తప్పు చేశామని ప్రతిపక్ష నేత అచ్చెన్నాయుడు పశ్చాత్తాపపడి ఉంటారని వ్యాఖ్యానించారు.