ధైర్యంగా ఎదుర్కొలేక పెయిడ్‌ ఆర్టిస్టులతో విమర్శలా?

ఇరిగేషన్‌ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌

నెల్లూరు: నన్ను ధైర్యంగా ఎదుర్కొన లేక పెయిడ్‌ ఆర్టిస్టుల ద్వారా విమర్శలు చేయిస్తున్నారని రాష్ట్ర్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మండిపడ్డారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ...యాదవులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. యాదవుల పాలతోనే చంద్రబాబు హెరిటేజ్ పెట్టి వేల కోట్లు సంపాదించారన్నారు. కులాన్ని కించపరిచేలా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.ఎస్సీ, బీసీ, ఎస్టీలకు మంత్రి వర్గంలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్థానం కల్పించడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు.

గణపతి సచ్చిదానంద ఆశ్వీరచనాలు తీసుకున్న మంత్రులు:
కృష్ణాష్టమి సందర్భంగా శుక్రవారం నెల్లూరులోని సుజాతమ్మ కాలనీలో ఉన్న కృష్ణయోగ మందిరాన్ని మంత్రులు మేకపాటి గౌతం రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్‌లు సందర్శించారు. గణపతి సచ్చిదానంద స్వామిని ఆశ్వీరచనాలు తీసుకున్నారు.

తాజా వీడియోలు

Back to Top