దాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేన
వ్యవసాయ దండుగ నుంచి వ్యవసాయ పండుగ
16 Sep 2022 11:33 AM
మండలిలో మంత్రి అంబటి రాంబాబు
అమరావతి: వ్యవసాయ దండుగ అన్న చంద్రబాబు పాలన నుంచి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఏపీ శాసన మండలి సమావేశాలు రెండోరోజు సమావేశాల్లో భాగంగా.. ఉద్దేశపూర్వకంగా సభను అడ్డుకునేందుకు టీడీపీ సభ్యులు ప్రయత్నించారు. ఈ సందర్భంలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్న చందాన ఉందని ఎద్దేవా చేశారు. ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి అంబటి తెలిపారు. సభాకార్యక్రమాలను ఉద్దేశపూర్వకంగా అడ్డుకునే యత్నం చేస్తున్నారని, మంత్రి ప్రసంగాన్ని అడ్డుకోవడం సముచితమేనా? అని మండలి చైర్మన్ టీడీపీ సభ్యులను ప్రశ్నించారు. చంద్రబాబు 'మనసులో మాట' పుస్తకాన్ని దాచేశారని, 2014 మేఫెస్టోను కూడా దాచేశారన్నారు. దమ్ముంటే 'మనసులో మాట' పుస్తకాన్ని బయటకు తీసుకురండి అంటూ మంత్రి అంబటి రాంబాబు సవాలు విసిరారు.