మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ఆక్సిజన్ వృథా కానివ్వొద్దు
26 Apr 2021 2:13 PM
ప్రభుత్వ ఆస్పత్రుల్లో రెమిడెసివర్ ఇంజక్షన్ల్ కొరత లేదు
కోవిడ్ ఫలితాలు 24 గంటల్లో వచ్చేలా చర్యలు
104కు కాల్ చేసిన మూడు గంటల్లో బెడ్ కేటాయించాలి
వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి ఆళ్ల నాని ఆదేశం
గుంటూరు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో రెమిడెసివర్ ఇంజక్షన్ల కొరత లేదని, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా ఇంజక్షన్ కొరత లేకుండా చూస్తామని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. గుంటూరు కలెక్టరేట్లో జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, హోంమంత్రి మేకతోటి సుచరిత సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్, కోవిడ్ బాధితులకు అందుతున్న వైద్యం, ఆక్సిజన్, ఆస్పత్రుల్లో బెడ్లు వంటి పలు అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. ఆక్సిజన్ వృథా కాకుండా మెడికల్ ఆఫీసర్లు దృష్టిపెట్టాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రెమిడెసివర్ ఇంజక్షన్ల్ కొరత లేదని, ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ కొరత లేకుండా చూస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 40 బెడ్స్ ఉన్న ఆస్పత్రులను కూడా కోవిడ్ సెంటర్లుగా అనుమతిస్తామని చెప్పారు. ప్రైమరీ కాంటాక్ట్ అందరికీ పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్ టెస్టుల ఫలితాలు 24 గంటల్లో వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 104కు కాల్ చేసిన మూడు గంటల్లో బెడ్ కేటాయించాలని ఆదేశించారు.