సెప్టెంబ‌ర్ 5న జ‌గ‌న‌న్న విద్యా కానుక‌

మంత్రి ఆదిమూలపు సురేష్‌

తాడేప‌ల్లి:  సెప్టెంబ‌ర్ 5వ తేదీన విద్యార్థుల‌కు జ‌గ‌న‌న్న విద్యా కానుక అంద‌జేస్తున్న‌ట్లు మంత్రి ఆదిమూల‌పు సురేష్ తెలిపారు. వ‌చ్చే నెల 5న పాఠ‌శాల‌లు పునఃప్రారంభించేందుకు అన్నిఏర్పాట్లు చేస్తున్నామ‌ని చెప్పారు. మొద‌టి ద‌శ నాడు-నేడు ప‌నులు దాదాపు పూర్తిఅయ్యాయ‌ని వెల్ల‌డించారు. జ‌గ‌న‌న్న విద్యా కానుక వ‌స్తువుల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఇప్ప‌టికే ప‌రిశీలించార‌ని తెలిపారు. ఈ కిట్‌లో మాస్క్‌తో పాటు పుస్త‌కాలు, యూనిఫాం, బ్యాగ్ ఉండేలా చ‌ర్య‌లు తీసుకున్నామ‌న్నారు. టెక్ట్స్ బుక్స్ ఇప్ప‌టికే జిల్లాల‌కు చేరాయ‌ని చెప్పారు. కోవిడ్ దృష్ట్యా అన్ని పాఠ‌శాల‌లు తెర‌వ‌డానికి గైడ్‌లైన్స్ ఇచ్చామ‌ని మంత్రి పేర్కొన్నారు. 

Back to Top