మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
మొదటిదశలో 15,715 స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నాం
25 Apr 2020 3:38 PM
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
తాడేపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో నాడు - నేడు కార్యక్రమం కింద మొదటి దశలో 15,715 పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. 'నాడు-నేడు'పై ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. "నాడు-నేడు మొదటిదశలో 15,715 వేల స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నాం. టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాం. గేట్ కోచింగ్ కూడా ఆన్లైన్ ద్వారా ఇచ్చేందుకు జేఎన్టీయూ ప్రయత్నాలు చేస్తోంది. స్కూళ్లు తెరిచాక కావాల్సిన యూనిఫామ్స్, బుక్స్ సిద్ధం చేస్తున్నాం." అని వివరించారు.