రాష్ట్రంలో ఏ పాఠశాల కూడా మూతపడ‌దు

మంత్రి ఆదిమూలపు సురేష్‌
 

అమ‌రావ‌తి: రాష్ట్రంలో ఏ పాఠశాల కూడా మూతపడదని విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ వెల్ల‌డించారు. ప్రతిపక్షాలు సత్యదూరమైన ప్రచారం చేస్తున్నాయని ఆయ‌న‌ మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ పాఠశాల కూడా మూతపడదన్నారు. రాష్ట్రంలో ఎక్కడా స్కూళ్ల విలీనం జరగలేదన్నారు. కాగా, సభా కార్యక్రమాలకు టీడీపీ సభ్యులు అడ్డుపడుతున్నారు. 8వ రోజూ కూడా టీడీపీ సభ్యుల తీరు మారలేదు. సభను అడ్డుకోవడం టీడీపీకి ప్రతిరోజూ అలవాటుగా మారిందని స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు.

Back to Top