చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
పదవి పోయినందుకు ఎలాంటి బాధ లేదు..
12 Apr 2022 10:14 AM
మాజీ మంత్రి సుచరిత
గుంటూరు : మంత్రి పదవి పోయినందుకు ఎలాంటి బాధ లేదని మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. మంత్రి పదవి రెండున్నరేళ్లు మాత్రమేనని సీఎం వైయస్ జగన్ ముందే చెప్పారన్నారు. తన వల్ల పార్టీకి చెడ్డ పేరు రాకూడదని.. వైయస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు. ఈ మేరకు సోమవారం గుంటూరులోని ఆమె నివాసంలో సుచరిత మీడియాతో మాట్లాడారు.
మంత్రి పదవి పోయినందుకు తనకు బాధగా లేదని.. అయితే కొన్ని కారణాలు బాధ కలిగించాయన్నారు. వ్యక్తిగత కారణాలు, అనారోగ్య పరిస్థితుల వల్ల తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పంపానన్నారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం జగనన్నతోనే ఉంటానని చెప్పారు. పదవిలో ఉన్నా, లేకున్నా ప్రజలకు అందుబాటులోనే ఉంటానని సుచరిత స్పష్టం చేశారు.